పీటీఐ వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు
ABN , First Publish Date - 2021-07-08T08:25:00+05:30 IST
కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ పీటీఐ వార్తా సంస్థ కూడా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. డిజిటల్ వార్తా సంస్థలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీటీఐ తన వ్యాజ్యంలో ఆరోపించింది.

న్యూఢిల్లీ, జూలై7: కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ పీటీఐ వార్తా సంస్థ కూడా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. డిజిటల్ వార్తా సంస్థలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీటీఐ తన వ్యాజ్యంలో ఆరోపించింది. దీనిపై ధర్మాసనం కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖకు, సమాచార ప్రసార శాఖకు నోటీసులిచ్చింది. ఇదే అంశంపై దాఖలైన ఇతర వ్యాజ్యాలతో దీన్ని కూడా కలిపి విచారించనున్నది.