అతిపెద్ద డ్రగ్స్ సరఫరాదారులలో ఒకరైన నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ
ABN , First Publish Date - 2021-10-07T23:19:17+05:30 IST
అతిపెద్ద డ్రగ్స్ సరఫరాదారులలో ఒకరైన నైజీరియన్ వ్యక్తి క్రూయిజ్ రైడ్ కేసులో అరెస్టయ్యాడు. బుధవారం ముంబైలోని బాంద్రాలో నైజీరియన్ జాతీయుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది.
![అతిపెద్ద డ్రగ్స్ సరఫరాదారులలో ఒకరైన నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921100705442816/10072021174901n57.jpg)
ముంబై: అతిపెద్ద డ్రగ్స్ సరఫరాదారులలో ఒకరైన నైజీరియన్ వ్యక్తి క్రూయిజ్ రైడ్ కేసులో అరెస్టయ్యాడు. బుధవారం ముంబైలోని బాంద్రాలో నైజీరియన్ జాతీయుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. ఇది క్రూయిజ్ రైడ్ కేసులో 18వ అరెస్టు అని ఎన్సీబీ పేర్కొంది. మెఫెడ్రోన్ డ్రగ్స్ అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ తెలిపింది. అరెస్టయిన వ్యక్తి అతిపెద్ద సరఫరాదారులలో ఒకరు మరియు అంతర్జాతీయ లింకులో ఉన్నారని ఎన్సీబీ వెల్లడించింది.