మయన్మార్ సరిహద్దులను మూసేసిన భారత్!
ABN , First Publish Date - 2021-03-22T20:21:26+05:30 IST
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
![మయన్మార్ సరిహద్దులను మూసేసిన భారత్!](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032202485928/03222021145118n31.jpg)
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడి నుంచి వలసలను నిరోధించే ఉద్దేశంతో మయన్మార్తో ఉన్న సరిహద్దులన్నింటినీ మూసేసింది. ఈ మేరకు మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్తాంగా, మయన్మార్ విదేశీ వ్యవహారాల మంత్రి జిన్ మర్ అంగ్తో వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ను ఆ దేశపు సైన్యం అదుపులోకి తీసుకుంది. దీంతో సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమకారులతో సైన్యం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందల మంది ఉద్యమకారులు సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు.