‘నమామి గంగే’ ప్రాజెక్టుకు భారత్-యూకే ఓకే
ABN , First Publish Date - 2021-11-28T08:24:49+05:30 IST
ప్రతిష్ఠాత్మక ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం భారత్-యూకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్సీఎంజీ),

లండన్, నవంబరు 27: ప్రతిష్ఠాత్మక ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం భారత్-యూకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్సీఎంజీ), లండన్లో భారత హైకమిషన్ నాలుగు చాప్టర్లను ప్రారంభించాయి. ఈ నెల ఆరంభంలో యూకేలో తన పర్యటనను ప్రారంభించిన ‘ద గంగా కనెక్ట్ ఎగ్జిబిషన్’ లండన్లోని ఇండియా హౌజ్లో ఇటీవలే తన ప్రయాణాన్ని ముగించింది. ఈ సందర్భంగా లండన్, మిడ్ల్యాండ్స్, స్కాట్లాండ్, వేల్స్లో ‘గంగా కనెక్ట్’ చాప్టర్లను గంగా కనెక్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించింది.