తిరువళ్లూర్ జిల్లా వరదలకుAndhra Government కారణం: మంత్రి నాజర్
ABN , First Publish Date - 2021-11-15T16:55:18+05:30 IST
ముందస్తు సమాచారం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోని పిచ్చాటూరు డ్యామ్ నుంచి 20 వేల ఘనపుటడుగుల నీరు విడుదల చేయడమే తిరువళ్లూర్ జిల్లా ముంపునకు కారణమని పశుసంవర్ధక శాఖ మంత్రి నాజర్ ఆరోపించారు. పళవేర్కాడు
చెన్నై/పెరంబూర్: ముందస్తు సమాచారం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోని పిచ్చాటూరు డ్యామ్ నుంచి 20 వేల ఘనపుటడుగుల నీరు విడుదల చేయడమే తిరువళ్లూర్ జిల్లా ముంపునకు కారణమని పశుసంవర్ధక శాఖ మంత్రి నాజర్ ఆరోపించారు. పళవేర్కాడు ప్రాంతంలోని ముంపు ప్రాంతాలు పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పిచ్చాటూరు డ్యామ్ నుంచి విడుదల చేసిన జలాలతో ఆరణి నదిలో వరద ప్రవాహం ఏర్పడి పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. ముంపు ప్రాంతాలకు చెందిన 3 వేల మందిని 40 సహాయక శిబిరాలకు తరలించి ఆహారం అందిస్తున్నామని, మరో 20 వేల మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆహారం, సరుకులు అందజేస్తున్నామని తెలిపారు.