ఓపెనర్‌గా వెళ్లి 234 రన్స్‌తో నాటౌట్‌గా వస్తారు

ABN , First Publish Date - 2021-01-20T17:26:27+05:30 IST

ఓపెనర్‌గా బరిలో దిగి 234 రన్స్‌తో నాటౌట్‌ బాట్స్‌మెన్‌గా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిలుస్తారని మంత్రి ఓఎస్‌ మణియన్‌ కితాబిచ్చారు. నాగపట్టణం జిల్లా లో ఎంజీఆర్‌ జయంతి వేడులను ...

ఓపెనర్‌గా వెళ్లి 234 రన్స్‌తో నాటౌట్‌గా వస్తారు

ఈపీఎస్‌కు మంత్రి మణియన్‌ కితాబు

పెరంబూర్‌: ఓపెనర్‌గా బరిలో దిగి 234 రన్స్‌తో నాటౌట్‌ బాట్స్‌మెన్‌గా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిలుస్తారని మంత్రి ఓఎస్‌ మణియన్‌ కితాబిచ్చారు. నాగపట్టణం జిల్లా లో ఎంజీఆర్‌ జయంతి వేడులను పురస్కరించుకొని సోమవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చేనేత, ఖద్దరు శాఖ మంత్రి ఓఎస్‌ మణియన్‌ మాట్లాడుతూ, ప్రజా గ్రామసభల పేరిట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు.  

Updated Date - 2021-01-20T17:26:27+05:30 IST