దేవాదాయశాఖపై విమర్శలు వద్దు
ABN , First Publish Date - 2021-10-30T15:50:18+05:30 IST
రాష్ట్ర దేవాదాయ శాఖపై బీజేపీ సహా ప్రతిపక్షపార్టీలు పనిగట్టుకుని పసలేని విమర్శలు చేస్తున్నాయని ఆ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు పేర్కొన్నారు. తమ శాఖ పనితీరును న్యాయ స్థానాలు సైతం పలుమారు ప్రశంసించిన
- మంత్రి శేఖర్బాబు
చెన్నై(Tamilnadu): రాష్ట్ర దేవాదాయ శాఖపై బీజేపీ సహా ప్రతిపక్షపార్టీలు పనిగట్టుకుని పసలేని విమర్శలు చేస్తున్నాయని ఆ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు పేర్కొన్నారు. తమ శాఖ పనితీరును న్యాయ స్థానాలు సైతం పలుమారు ప్రశంసించిన సందర్భాలున్నాయని ఆయన తెలిపారు. స్థానిక చూళై ప్రాంతంలో సుప్రసిద్ధ అంకాళపరమేశ్వరి ఆలయాన్ని శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆక్రమణలో ఉన్న ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడం, అన్ని కులస్థులవారిని అర్చకులుగా నియమించడం వంటి విప్లవాత్మకమైన చర్యలు చేపడుతుండటం చూసి ఓర్వలేకనే బీజేపీ తదితర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై దేవాదాయ శాఖపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.