Singhu border: రైతుల శిబిరం వద్ద మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-10-15T15:20:32+05:30 IST
ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసన తెలిపే ప్రధాన వేదిక వద్ద ఓ వ్యక్తి శవమై కనిపించాడు...
న్యూఢిల్లీ : ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసన తెలిపే ప్రధాన వేదిక వద్ద ఓ వ్యక్తి శవమై కనిపించాడు. రైతుల ప్రధాన వేదిక వద్ద ఓ వ్యక్తి చేయి కత్తిరించి ఉంది. నిరసన తెలిపిన రైతుల ప్రధాన వేదిక దగ్గర బారికేడ్కి వేలాడదీసిన వ్యక్తి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కనిపించింది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండ్లి పోలీసులు వచ్చి బారికేడ్ వద్ద వేలాడుతున్న మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.35 ఏళ్ల వ్యక్తిని మణికట్టు వద్ద చేతిని కత్తిరించి దారుణంగా హత్య చేశారని భావిస్తున్నారు. రైతుల ప్రధాన వేదిక వద్ద వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటనతో రైతులు నిరసనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.