నందిగ్రామ్లో ఓడిపోయిన మమతా నైతికంగా సీఎం కాకూడదు...
ABN , First Publish Date - 2021-05-05T14:49:55+05:30 IST
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.....

త్రిపుర సీఎం సంచలన వ్యాఖ్యలు
అగర్తలా (త్రిపుర): త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలైన మమతాబెనర్జీ నైతికంగా పశ్చిమబెంగాల్ సీఎం కాకూడదని త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ వ్యాఖ్యానించారు.నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమతా బెనర్జీ పార్టీ 213 స్థానాలు గెల్చుకున్నా, నైతికంగా సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయరాదని విప్లవ్ దేవ్ సూచించారు. బెంగాల్ ఎన్నికల్లో జరిగిన హింసాకాండ వల్లనే బీజేపీ ఓటమి పాలైందని, కాని గతంలో కంటే బీజేపీకి బెంగాల్ రాష్ట్రంలో ఓట్ల శాతం పెరిగిందని సీఎం చెప్పారు.
‘‘నందిగ్రామ్ లో మమతాబెనర్జీ ఓటమిపాలైనందున నైతికంగా ఆమె సీఎం పదవి చేపట్టరాదు’’ అని విప్లవ్ దేవ్ చెప్పారు. నందిగ్రామ్ లో కుట్ర జరిగిందని మమతాబెనర్జీ ఆరోపించారని, కాని రాష్ట్రంలో టీఎంసీ విజయం వెనుక కూడా కుట్ర జరిగిందేమోనని దేవ్ అనుమానం వ్యక్తం చేశారు.