మాల్స్, థియేటర్లు, మెట్రోలతోనే కరోనా వ్యాప్తి: కేజ్రీవాల్ సర్కారు

ABN , First Publish Date - 2021-03-24T17:20:19+05:30 IST

దేశవ్యాప్తంగా మారోమారు కరోనా వైరస్...

మాల్స్, థియేటర్లు, మెట్రోలతోనే కరోనా వ్యాప్తి: కేజ్రీవాల్ సర్కారు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మారోమారు కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో సీఎం కేజ్రీవాల్ సర్కారు స్పందిస్తూ... ఢిల్లీలో మాల్స్, థియేటర్లు, మెట్రోలతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలలో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొంది. ఈ ప్రదేశాలపై అధకారులు ప్రత్యేక దృష్టి సారించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కరోనా ర్యాండమ్ టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని వైద్యాధికారులను కోరింది. ఇదిలావుండగగా ఢిల్లీలో 93 రోజుల తరువాత గడచిన 24 గంటల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 4,411 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 620 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ కారణంగా నలుగురు బాధితులు కన్నుమూశారు. 



Updated Date - 2021-03-24T17:20:19+05:30 IST