తీవ్ర సంచలనం : ప్రియుడిపై యాసిడ్ పోసి.. కత్తితో దాడి..
ABN , First Publish Date - 2021-12-05T16:41:11+05:30 IST
రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
చెన్నై : రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని పెళ్లాడిన యువకుడిపై ప్రియురాలు యాసిడ్ పోయడంతో పాటు కత్తితో హత్యాయత్నం చేసిన ఘటన కోయంబత్తూరులో తీవ్ర సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన రాకేష్, కాంచీపురానికి చెందిన జయంతి (27) రెండేళ్ల క్రితం దుబాయ్లో పనిచేస్తున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఆర్నెల్ల క్రితం స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఇటీవల జయంతికి తెలియకుండా రాకేష్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫోన్ చేసి గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్ను రాకేష్పై పోసి, కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరూ అచేతనంగా పడిఉండగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు.