కుంభమేళా-2021 జనవరి 14న ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-05T14:40:15+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా -2021 జనవరి 14వతేదీన హరద్వార్‌లో ప్రారంభం కానుంది....

కుంభమేళా-2021 జనవరి 14న ప్రారంభం

 హరిద్వార్ : ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా -2021 జనవరి 14వతేదీన హరద్వార్‌లో ప్రారంభం కానుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్ లలో జరగనుంది. కుంభంలో 4 షాహిస్నాన్ , 6 ప్రధాన స్నాన్ ఘట్టాలుంటాయి. కుంభమేళా సందర్భంగా కుంభంలో భక్తులు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. కుంభమేళా సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం చేసే వారు మోక్షం పొందుతారని, వ్యాధులు, పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి జనవరి 14 నుంచి కుంభమేళా ఉత్సవం ప్రారంభం కానుంది.  ఏప్రిల్ 27వతేదీ వరకు షాహి స్నాన్ ఘట్టాలుంటాయి. 

Updated Date - 2021-01-05T14:40:15+05:30 IST