కేరళలో తగ్గని కరోనా ఉధృతి.. కొత్తగా 12,443 కేసులు..
ABN , First Publish Date - 2021-06-20T04:54:39+05:30 IST
కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా..
తిరువనంతపురం: కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 12,443 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 1,21,743 నమూనాలను పరీక్షించగా.. ఈ మేరకు కేసులు వెలుగుచూసినట్టు సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,861 వరకు ఉన్నట్టు ఆయన తెలిపారు. కాగా శనివారం మరో 115 మంది మృత్యువాత పడడంతో.. రాష్ట్రంలో కరోనా మరణాలు 11,948కి పెరిగాయి.