కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే థామస్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-12-22T17:25:32+05:30 IST
రళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు పీటీ థామస్ (70) బుధవారం ఉదయం ..
తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు పీటీ థామస్ (70) బుధవారం ఉదయం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. గత కొద్ది వారాలుగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. కేరళలోని కాంగ్రెస్ నేతల్లో పవర్ఫుల్ నేతగా పేరున్న థామస్ 2016 నుంచి ఎర్నాకుళంలోని త్రిక్కకర అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 నుంచి 2014 వరకూ ఎంపీగా ఇడుక్కి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల కాంగ్రెస్ కేరళ విభాగం పునర్వవస్థీకరణలో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.