కశ్మీర్‌లో మహారాజుల పాలనే మెరుగు: ఆజాద్‌

ABN , First Publish Date - 2021-12-26T07:15:04+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో గత రెండున్నరేళ్లుగా వ్యాపార, అభివృద్ధి కార్యకలాపాలు మందగించాయని, ప్రజలు పేదరికం వైపు పయనిస్తున్నారని ..

కశ్మీర్‌లో మహారాజుల పాలనే మెరుగు: ఆజాద్‌

జమ్మూ, డిసెంబరు 25 : జమ్మూకశ్మీర్‌లో గత రెండున్నరేళ్లుగా వ్యాపార, అభివృద్ధి కార్యకలాపాలు మందగించాయని, ప్రజలు పేదరికం వైపు పయనిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాజుల నిరంకుశ పాలన ప్రస్తుత పాలన కంటే ఎంతో మెరుగ్గా ఉందని, ప్రస్తుత ప్రభుత్వం సంప్రదాయకమైన ద్వైవార్షిక ‘దర్బార్‌ మూవ్‌’ ఆచారాన్ని నిలిపివేసిందని విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎప్పుడూ దర్బార్‌ మూవ్‌కు మద్దతుగా ఉంటాను. జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల ప్రజల కోసం మహారాజులు తీసుకున్న మూడు నిర్ణయాల్లో దర్బార్‌ మూవ్‌ ఒకటి’ అని ఆజాద్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2021-12-26T07:15:04+05:30 IST