‘గెలిస్తే ఆర్భాటాలొద్దు.. ఓడితే కుంగిపోవద్దు’
ABN , First Publish Date - 2021-05-02T14:15:16+05:30 IST
గెలిస్తే ఆర్భాటాలు వద్దని, ఓడితే కుంగిపోవద్దని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆ
- కార్యకర్తలకు కమల్ సూచన
పెరంబూర్(చెన్నై): గెలిస్తే ఆర్భాటాలు వద్దని, ఓడితే కుంగిపోవద్దని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, కార్యకర్తలు, వారి కుటుంబాల భద్రతే తనకు ముఖ్యమన్నారు. లెక్కింపు కేంద్రాలకు ప్రధాన ఏజెంట్లు మాత్రమే వెళతారని, కార్యకర్తలు వెళ్లవద్దన్నారు. ఈ ఎన్నికలు మనకు సరికొత్త అనుభవాన్ని, కొత్త విషయాలను నేర్పించాయన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని కమల్ పిలుపునిచ్చారు.