జాతీయ పార్టీలతో కమల్ ఢీ
ABN , First Publish Date - 2021-03-14T07:59:56+05:30 IST
కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన మక్కల్ నీదిమయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ ఎదుర్కోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు కోయంబత్తూరులో లక్షా
![జాతీయ పార్టీలతో కమల్ ఢీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2021031402040501/03142021022955n90.jpg)
కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ
ప్రధాన ప్రత్యర్థులుగా కాంగ్రెస్, బీజేపీ
చెన్నై-ఆంధ్రజ్యోతి: కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన మక్కల్ నీదిమయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ ఎదుర్కోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు కోయంబత్తూరులో లక్షా 45వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గంలోనే ఉన్న కోయంత్తూరు సౌత్ శాసనసభ నియోజకవర్గంలో 23,838 ఓట్లు ఆ పార్టీకి లభించాయి. ఈ కారణంతోనే కమల్హాసన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో విద్యావంతులైన యువకులు, వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, మైనారిటీలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అధికంగా ఉండటంతో వీరి ఓట్లన్నీ తనకు సులువుగా లభిస్తాయన్న అంచనాలో ఆయన ఉన్నారు. అన్నాడీఎంకే అధిష్ఠానం తమ కూటమిలోని బీజేపీకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తమ కూటమిలోని కాంగ్రె్సకు ఈ సీటును కేటాయించింది. అయితే ఈ రెండు పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కమల్హాసన్ పోటీ చేస్తుండటంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని బీజేపీ, కాంగ్రెస్ యోచిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే ఐదేసి సార్లు, కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిచాయి.