ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కన్నుమూత
ABN , First Publish Date - 2021-12-05T08:02:57+05:30 IST
: ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా(67) కొవిడ్తో దీర్ఘకాలంగా బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ....
న్యూఢిల్లీ, డిసెంబరు 4: ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా(67) కొవిడ్తో దీర్ఘకాలంగా బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అపోలో ఆస్పత్రి ఇన్సెంటివ్కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ తన తండ్రి కన్నుమూసినట్లు ఆయన కుమార్తె హాస్యనటి, రచయిత మల్లికా దువా సోషల్మీడియాలో ధ్రువీకరించారు. లోధి శ్మశానవాటికలో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. హిందీ జర్నలిజానికి మార్గదర్శకుడిగా నిలిచిన దువా దూరదర్శన్, ఎన్డీటీవీలలో పని చేశారు. ఇటీవలి కాలంలో రాజకీయ వ్యాఖ్యాతగా డిజిటల్ మీడియాలో మంచిపేరు గడించారు. 2008లో జర్నలిజం విభాగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎలకా్ట్రనిక్ మీడియా జర్నలిజంలో రామ్నాథ్ గోయంకా అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఆయన. దువా భార్య రేడియాలజిస్ట్ పద్మావతికి ఈ ఏడాది ప్రారంభంలో కొవిడ్ వైరస్ సోకింది. దాంతో బాధపడుతూ ఆమె జూన్లో మృతి చెందారు. ఆయనకు మల్లికతోపాటు మరో కుమార్తె మానసిక వైద్యనిపుణురాలు బకుల్ దువా ఉన్నారు.