భారత్లో కొత్తగా 13,154 కరోనా కేసులు...268 మంది మృతి
ABN , First Publish Date - 2021-12-30T15:58:27+05:30 IST
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 268 మంది మృత్యువాతపడ్డారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 268 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,58,778గా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్తో 4,80,860 మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,43,83,22,742గా ఉంది.