Indiaలో కొత్తగా 31,222 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-09-07T16:01:00+05:30 IST
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా..290 మంది మృతి చెందారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా..290 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,92,864 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,30,58,843కి చేరింది. మొత్తం 3,22,24,937 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కొవిడ్తో 4,41,042 మంది మృత్యువాతపడ్డారు. అలాగే 69,90,62,776 టీకా తీసుకున్నారు.