బీజేపీలో చేరా.. ‘నిశ్చింత’గా ఉన్నా..!
ABN , First Publish Date - 2021-10-15T07:26:33+05:30 IST
‘‘బీజేపీలోకి వెళ్లాక అంతా ప్రశాంతంగా ఉంది. విచారణలు లేవు.. వేధింపులూ లేవు.
విచారణలు లేవు.. వేధింపులూ లేవు: మహారాష్ట్ర నేత
పుణె, అక్టోబరు 14: ‘‘బీజేపీలోకి వెళ్లాక అంతా ప్రశాంతంగా ఉంది. విచారణలు లేవు.. వేధింపులూ లేవు. హాయిగా గుర్రుపెట్టి నిద్రపోగలుగుతున్నా..’’ ఇవి.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మాజీ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ పాటిల్.. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రె్సను వీడి బీజేపీలో చేరారు. ఆయన గురువారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎలాంటి విచారణలూ ఉండవు కాబట్టి ‘నిశ్చింత’గా ఉండగలుగుతున్నానని చమత్కరించారు. కాగా, ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఎన్సీబీలను కేంద్రం ప్రయోగిస్తోందంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించిన నేపథ్యంలో ఓ బీజేపీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.