ప్రభుత్వోద్యోగులకు 3 శాతం కరువు భత్యం

ABN , First Publish Date - 2021-10-29T17:15:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక రూపంలో కరువు భత్యం ప్రకటించింది. జూలై 1 నుంచి వర్తించేలా ప్రభుత్వోద్యోగులకు 3 శాతం భత్యాన్ని అందజేయనున్నారు. ఈ పెరుగుదలతో కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగుల

ప్రభుత్వోద్యోగులకు 3 శాతం కరువు భత్యం

బెంగళూరు(Karnataka): రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక రూపంలో కరువు భత్యం ప్రకటించింది. జూలై 1 నుంచి వర్తించేలా ప్రభుత్వోద్యోగులకు 3 శాతం భత్యాన్ని అందజేయనున్నారు. ఈ పెరుగుదలతో కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 24.50 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలోని 6 లక్షల మంది ఉద్యోగులు, 4.50 లక్షల మంది పింఛను దారులకు, బోర్డులు, కార్పోరేషన్లలో సేవలందిస్తున్న 3 లక్షల మంది ఉద్యోగులకు దీని వల్ల ప్రయోజనం లభించనుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన 24 గంటల్లోపే స్పందించి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కరువు భత్యం ప్రకటించడం సంతోషంగా ఉందని ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సిఎస్. షడాక్షరి గురువారం మీడియాతో తెలిపారు.

Updated Date - 2021-10-29T17:15:06+05:30 IST