కరోనా పోరు కోసం గోవాలో మరో ఔషధం.. 18 నిండిన వారంతా..
ABN , First Publish Date - 2021-05-10T23:54:32+05:30 IST
దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను కరోనా బారి నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభత్వాలు అనేక రకాల ప్రయత్నాలు..
పానాజి: దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను కరోనా బారి నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందలో భాగంగానే గోవా రాష్ట్ర సర్కార్ తాజాగా ఓ ఔషదాని తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన వారంతా ఈ ఔషధాన్ని తీసుకోవాలని సూచించింది. దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రానే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఐవర్మెక్టిన్ ఔషధాన్ని వేసుకోవాలని, కరోనాకు ముందు వచ్చే వైరల్ ఫీవర్ను నిరోధించేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని, అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు. ఈ ఔషధాన్ని ప్రతి హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉండేలా చూస్తామని, ప్రతి ఒక్కరూ 5 ట్యాబ్లెట్ల చొప్పున వీటిని తీసుకోవాలని సూచించారు. కాగా.. ఈ ఔషధం జపాన్కు చెందింది. దీనిని సింగిల్ మైక్రో-ఆర్గనిజమ్ ద్వారా తయారు చేయడం జరిగింది.
