18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ `ఐవర్‌మెక్టీన్`: గోవా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-11T18:40:06+05:30 IST

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం కట్టడి చర్యలకు దిగింది.

18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ `ఐవర్‌మెక్టీన్`: గోవా ప్రభుత్వం

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం కట్టడి చర్యలకు దిగింది. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్‌ను సోమవారం విడుదల చేసింది. గోవాలోని 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ యాంటీ వైరల్ డ్రగ్ `ఐవర్‌మెక్టీన్`ను తీసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ రాణె ప్రకటించారు. 


`కోవిడ్, ఇతర వైరల్ జ్వరాల నివారణలో భాగంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ ఐవర్‌మెక్టీన్ ఇవ్వాలని నిర్ణయించాం. అన్ని ప్రభుత్వ హెల్త్ సెంటర్లలోనూ ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. 18 ఏళ్లు దాటిన వారందరూ 5 మాత్రల చొప్పున వేసుకోవాలి. కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఈ మాత్రలను వేసుకోవాల`ని రాణె సూచించారు.  

Updated Date - 2021-05-11T18:40:06+05:30 IST