మహాత్ముడి విగ్రహానికి అవమానం
ABN , First Publish Date - 2021-06-17T16:56:38+05:30 IST
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా బసాపుర గ్రామంలో ఈ ఘాతుకం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బసాపుర గ్రామానికి చెందిన
- కత్తితో గాంధీ విగ్రహం కాళ్లు నరికి తోసేసిన అగంతకుడు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బసాపుర గ్రామంలో ఉద్రిక్తత
గంగావతి(కర్ణాటక): జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా బసాపుర గ్రామంలో ఈ ఘాతుకం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బసాపుర గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం గ్రామంలోని గాంధీ సర్కిల్లో ఏర్పాటు చేసిన మహాత్ముడి విగ్రహం వద్దకు వచ్చి కత్తితో కాళ్లు నరికి దిమ్మె పైనుంచి కిందకు తోసేశాడు. దృశ్యాన్ని గమనించిన బసాపురం గ్రామస్తులు అతడిని అడ్డుకోబోగా... చేతిలో ఉన్న కత్తిని చూపించి దగ్గరకు వచ్చిన వారిపై దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఘాతుకానికి పాల్పడిన మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో మూడు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.