ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
ABN , First Publish Date - 2021-09-13T19:49:47+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలోని సబ్జీ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. మధ్యాహ్నం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సబ్జీ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. మధ్యాహ్నం 11.50 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పలువురు శిధిలాల కింద చిక్కుకుపోయారు. ఒక వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీసి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఎనిమిది అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయనీ, స్థానిక పోలీసులు, ఎంసీడీ, ఎన్డీఆర్ఎఫ్ తదితరులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సెంట్రల్ రంగే జాయింట్ సీపీ ఎన్.ఎస్.బుడేలా తెలిపారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో అంచనా వేయడానికి సమయం పడుతుందని, ఇంతవరకూ ఒకరిని కాపాడామని, తలకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. కాగా, ఈ ఘటన దురదృష్టకరమని, సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, పరిస్థితి స్వయంగా సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.