‘మిస్టర్ ఇండియా’ మాజీ విజేత ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!

ABN , First Publish Date - 2021-09-17T00:49:40+05:30 IST

‘మిస్టర్ ఇండియా’ మాజీ విజేత మనోజ్ పాటిల్ ఆత్మహత్యకు యత్నించాడు. ఓషివారాలోని తన నివాసంలో

‘మిస్టర్ ఇండియా’  మాజీ విజేత ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!

ముంబై: ‘మిస్టర్ ఇండియా’ మాజీ విజేత మనోజ్ పాటిల్ ఆత్మహత్యకు యత్నించాడు. ఓషివారాలోని తన నివాసంలో కొన్ని పిల్స్ మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉందని కూపర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గత అర్ధ రాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అతడి మేనేజర్ పరినాజ్ తెలిపారు. 


మనోజ్ పాటిల్ ఇటీవల ఓషివారా పోలీసులకు ఓ లేఖ రాస్తూ తనను అప్రతిష్ఠపాలు చేస్తూ, పరువు తీస్తున్న నటుడు, బాడీబిల్డర్ సహీల్ ఖాన్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మనోజ్, సాహిల్ మధ్య వీడియోల యుద్ధం కూడా నడిచింది. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వీడియోలు పోస్టు చేసుకున్నారు. తాజాగా, సాహిల్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేస్తూ దానికి ‘మనోజ్ స్టెరాయిడ్ వాలా కౌన్ హై? ఎనీ ఐడియా! బిలీవిట్ ఆర్ నాట్. ఫర్ మోర్ వాచ్ మై స్టోరీ’’ అని క్యాప్షన్ తగిలించాడు. 


సాహిల్ ఖాన్ హింసించడం వల్లే మనోజ్ పాటిల్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు అతడి మేనేజర్ పరి నాజ్ తెలిపారు. ఏడాదిగా అతడి వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అతడి ఫోన్ నంబరును కూడా వైరల్ చేశాడని తెలిపారు. గత రాత్రి స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తూ ఓ మెడికల్ షాపు వద్ద ఆగి కొన్ని పిల్స్ కొన్నాడని, అవేంటన్నవి అతడి స్నేహితులకు కూడా తెలిదని గుర్తు చేసుకున్నారు. ఇంటికి చేరుకున్నాక భోజనం కూడా చేయలేదని, అపస్మారక స్థితిలో పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు ఆమె వివరించారు. ప్రస్తుతం మనోజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మనోజ్ తల్లి కూడా సాహిల్ ఖాన్ కారణంగా తన కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు.  

Updated Date - 2021-09-17T00:49:40+05:30 IST