రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగుల మృతి

ABN , First Publish Date - 2021-05-05T19:02:33+05:30 IST

రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....

రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగుల మృతి

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై  హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఈ విచారణకు కలెక్టరు కమిటీని ఏర్పాటు చేశారు. రూర్కీ ఆజాద్ నగర్ లోని 85 పడకల కొవిడ్ -19 ఆసుపత్రిలో ఉన్న 20 సిలిండర్లు  అయిపోవడంతో తెల్లవారుజామున మార్చారు. దీంతో ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని జిల్లామెజిస్ట్రేట్ చెప్పారు. ఆక్సిజన్ అందక రోగులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Updated Date - 2021-05-05T19:02:33+05:30 IST