నిబంధనల ఉల్లఘించిన 26 వాణిజ్య సంస్థలకు జరిమానా

ABN , First Publish Date - 2021-07-12T14:01:30+05:30 IST

చెన్నైలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 26 వాణిజ్య సంస్థలకు రూ.3.30 లక్షల జరిమానాను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ విధించింది. శనివారం కార్పొరేషన్‌ పరిధిలోని

నిబంధనల ఉల్లఘించిన 26 వాణిజ్య సంస్థలకు జరిమానా

చెన్నై/ప్యారీస్: చెన్నైలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 26 వాణిజ్య సంస్థలకు రూ.3.30 లక్షల జరిమానాను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ విధించింది. శనివారం కార్పొరేషన్‌ పరిధిలోని 15 జోన్లలో ఆకస్మికతనిఖీలు నిర్వహించిన అధికారులు కరోనా నివారణ నిబంధనలు సక్రమంగా పాటించలేదని కారణం చూపి 26 సంస్థలపై కేసులు నమోదు చేశారు. హోటళ్లు, కల్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లు పరిశీలించారు. గత మే నెల 1వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు నిబంధనలు పాటించని 6,130 సంస్థల నుంచి, 30,755 మంది వ్యక్తుల నుంచి జరిమానాగా రూ.3.22 కోట్లు జీసీసీ వసూలు చేసింది. అలాగే, అధికసంఖ్యలో వివాహ వేడుకల్లో పాల్గొన్నందు కుగాను 39 కల్యాణమండపాలకు రూ.1.67 లక్షల జరిమానా విధించనట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-12T14:01:30+05:30 IST