ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2021-04-11T22:25:36+05:30 IST

బీజాపూర్- సుక్మా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా బలగాలు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్ : బీజాపూర్- సుక్మా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా బలగాలు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచే ఈ దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులే టార్గెట్‌గా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య దంతేవాడ జిల్లాలోని గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మరికొందరు మావోయిస్టులు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

Updated Date - 2021-04-11T22:25:36+05:30 IST