బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ
ABN , First Publish Date - 2021-02-26T23:07:16+05:30 IST
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను 8 దశల్లో నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. బెంగాల్లో మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా త్వరలో జరగబోయే ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను 8 దశల్లో నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. బెంగాల్లో మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాలుగో దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదో దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరో దశ పోలింగ్, ఏప్రిల్ 26న ఏడో దశ పోలింగ్, ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ జరనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఎన్నికల ఫలితాలను మిగతా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే మే 2న ప్రకటించనున్నట్లు ఈసీ పేర్కొంది.