యునెస్కో వారసత్వ సాంస్కృతిక వేడుకల జాబితాలో దుర్గాపూజ
ABN , First Publish Date - 2021-12-16T01:26:57+05:30 IST
కోల్కతా: భారత్లో మరీ ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో ప్రముఖ పండుగల్లో ఒకటైన దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు దక్కింది.
కోల్కతా: భారత్లో మరీ ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో ప్రముఖ పండుగల్లో ఒకటైన దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు దక్కింది. మానవ సాంస్కృతిక వారసత్వ నైరూప్య చిహ్నాల జాబితాలో దుర్గాపూజకి చోటు దక్కింది. పారిస్లో జరుగుతున్న యునెస్కో సమావేశాల్లో ఈ నిర్ణయం వెలువడింది. మతాలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారిని, లింగభేదం లేకుండా, పేద, ధనిక అనే తేడా పాటించకుండా అందర్నీ కలుపుకుంటూ జరుపుకునే పండుగ ఇదంటూ యునెస్కో కీర్తించింది. 2010లో పశ్చిమబెంగాల్ పురులియాలోని చౌ జానపద నృత్యానికి, కేరళలోని ముడియెట్టు పండుగకు, రాజస్థాన్లోని కల్బేలియా జానపద నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించింది. 2013లో మణిపూర్లోని సంకీర్తనల వేడుకకు, 2014లో పంజాబ్లోని వ్యవసాయ పండుగకు యునెస్కో పండుగల్లో చోటు దక్కింది. 2016లో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించగా 2017లో కుంభమేళాకు యునెస్కో గుర్తింపు దక్కింది.