డీకే శివకుమార్‌ ఆప్తుడి ఇంటిపై ఐటీ దాడులు

ABN , First Publish Date - 2021-10-29T17:25:25+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌కు అత్యంత ఆప్తుడైన యుబీ శెట్టి నివాసంపై గురువారం ఐటీ దాడులు జరిగాయి. ధారవాడలో సివిల్‌ కాంట్రాక్టరుగానే కా కుండా ఉడుపి జిల్లా బైందూరులో విద్యాసంస్థ కలిగిన శె

డీకే శివకుమార్‌ ఆప్తుడి ఇంటిపై ఐటీ దాడులు

బెంగళూరు(Karnataka): రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌కు అత్యంత ఆప్తుడైన యుబీ శెట్టి నివాసంపై గురువారం ఐటీ దాడులు జరిగాయి. ధారవాడలో సివిల్‌ కాంట్రాక్టరుగానే కా కుండా ఉడుపి జిల్లా బైందూరులో విద్యాసంస్థ కలిగిన శెట్టిపై దాడి జరిగింది. గోవా నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం ఏకకాలంలో నివాసంతో పాటు పలు చోట్ల దాడులు చేసినట్లు సమాచారం. ఇతడి ఆదాయానికి సంబంధించిన మూల ఆధారాలను వెలికి తీసేందుకే దాడులు జరిపినట్లు సమాచారం. డీకే శివకుమార్‌కు అత్యంత ఆప్తుడైనందునే ఐటీ దాడి జరిగిందని ఇది రాజకీయ దురుద్దేశ్యమని కాంగ్రెస్‌ వర్గాలు మండిపడ్డాయి. ఇలాంటి దాడుల ద్వారా కాంగ్రెస్‌ నాయకులను మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని ధారవాడ కాంగ్రె్‌సనేత రాబర్ట్‌ దద్దాపురి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-29T17:25:25+05:30 IST