మేఘాలయలో పదికోట్ల ఏళ్లనాటి డైనోసార్ల ఎముకలు
ABN , First Publish Date - 2021-05-05T08:18:50+05:30 IST
సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడిన సారోపాడ్ డైనోసార్లకు చెందిన ఎముకలు మేఘాలయలో వెలుగుచూశాయి. గడచిన రెండేళ్లుగా పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో...

న్యూఢిల్లీ, మే 4: సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడిన సారోపాడ్ డైనోసార్లకు చెందిన ఎముకలు మేఘాలయలో వెలుగుచూశాయి. గడచిన రెండేళ్లుగా పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎ్సఐ) పాలియెంటాలజీ విభాగం పరిశోధకులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎముకలు వెలుగుచూసినట్లు వారు తెలిపారు.