దిగ్విజయ్ సింగ్కు కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-16T16:29:03+05:30 IST
మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్
న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా శుక్రవారం వెల్లడించారు. తాను ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. తనను ఇటీవల కలిసినవారు ఐసొలేషన్లో ఉండాలని కోరారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్ సుర్జీవాలా శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్లో, తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. గత ఐదు రోజుల్లో తనను కలిసినవారంతా స్వీయ ఏకాంతంలో గడపాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్కు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. తాను క్వారంటైన్లో ఉన్నానని ఆమె ట్విటర్ వేదికగా శుక్రవారం తెలిపారు.
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్లో, తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఐసొలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.