డీజీపీల సమావేశంలో.. అంతర్గత భద్రతపై చర్చ
ABN , First Publish Date - 2021-11-21T07:30:05+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో రెండో రోజు శనివారం జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు బలగాల డైరెక్టర్ జనరల్స్ ముగింపు సమావేశంలో....

పాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్ షా
లఖ్నవూ, నవంబరు 20: ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో రెండో రోజు శనివారం జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు బలగాల డైరెక్టర్ జనరల్స్ ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అంతర్గత భద్రత, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపైన చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ రోజంతా ఉండి.. వక్తల కీలకోపన్యాసాలను విన్నారు.