వ్యాక్సిన్ కొరతతో 125 కరోనా కేంద్రాల మూసివేత: ఆప్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-12T01:31:19+05:30 IST

వ్యాక్సిన్ కొరతతో 125 కరోనా కేంద్రాల మూసివేత: ఆప్ ఎమ్మెల్యే

వ్యాక్సిన్ కొరతతో 125 కరోనా కేంద్రాల మూసివేత: ఆప్ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఢిల్లీలో వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్లలోపు వ్యక్తుల కోసం కోవాక్సిన్ స్టాక్‌లో లేదని, కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇచ్చే 125 కేంద్రాలను మూసివేయాల్సి ఉంటుందని మంగళవారం సాయంత్రం తర్వాత ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. కేంద్రం నుంచి ఢిల్లీకి మంగళవారం నాటికి 2.67 లక్షల కోవిషీల్డ్ డోసులు లభిస్తుందని ఆమె వెల్లడించారు. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు (1.39 లక్షలకు పైగా) టీకాలు వేసినట్లు ఆమె తెలిపారు. 

Updated Date - 2021-05-12T01:31:19+05:30 IST