Delhi: దేశంలో కొత్తగా 30వేలకు పైగా కరోనా కేసులు..

ABN , First Publish Date - 2021-08-03T17:06:11+05:30 IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 30,549 కరోనా కేసులు నమోదు కాగా, 422 మంది కరోనా మరణించారు

Delhi: దేశంలో కొత్తగా 30వేలకు పైగా కరోనా కేసులు..

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 30,549 కరోనా కేసులు నమోదు కాగా, 422 మంది కరోనా మరణించారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,26,507కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో దేశంలో 4,25,195 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 38,884 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్ కేసులు ఉండగా.. 3.08 కోట్ల మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 47.85 కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది.

Updated Date - 2021-08-03T17:06:11+05:30 IST