Delhiలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-31T17:24:09+05:30 IST
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ప్రారంభమైంది.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుండి ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. వస్తు, సేవల పన్నుపై నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగనుంది.