హైతీలో 1300కు పెరిగిన భూకంప మృతులు
ABN , First Publish Date - 2021-08-17T09:12:04+05:30 IST
హైతీ భూకంపంలో మృతుల సంఖ్య 1300కు పెరిగింది. రిక్టర్ స్కేల్పై 7.2గా తీవ్రత నమోదైన ఈ భూకంపం శనివారం దేశాన్ని..
లెస్కేయెస్,ఆగస్టు 16: హైతీ భూకంపంలో మృతుల సంఖ్య 1300కు పెరిగింది. రిక్టర్ స్కేల్పై 7.2గా తీవ్రత నమోదైన ఈ భూకంపం శనివారం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రకృతి విపత్తు ధాటికి వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. 6వేల మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలు, విరిగిపడుతున్న కొండచరియలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.