గడచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలివే....
ABN , First Publish Date - 2021-06-21T15:39:00+05:30 IST
దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 53 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి ఇదే సమయంలో 14 వందల మంది కరోనాతో కన్నుమూశారు. గడచిన 24 గంటల్లో 78 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,35,221. ఇక వ్యాక్సినేషన్ విషయానికి ఈరోజు ఉదయం 8 గంటల వరకు దేశంలో మొత్తం 28,00,36,898 మందికి టీకాలు వేశారు. ఆదివారం దేశంలో 30,39,996 మందికి టీకాలు వేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు మొత్తం 39,24,07,782 మందికి కరోనా టెస్టులు చేశారు.