Covid పరీక్షలు పెంచండి: ఓపీఎస్ వినతి
ABN , First Publish Date - 2021-12-22T16:19:05+05:30 IST
ఒమైక్రాన్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు అధికం చేయాలని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విడుదల చేసిన
పెరంబూర్(చెన్నై): ఒమైక్రాన్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు అధికం చేయాలని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ఆనందంగా ఉన్నా, మరోవైపు ఒమైక్రాన్ లక్షణాలు నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విదేశీ ప్రయాణికులకు ఆయా విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నా, వారు రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత కూడా పరీక్షలు నిర్వహించాలని ఓపీఎస్ సూచించారు.