కరోనా నిబంధనలు కఠినతరం
ABN , First Publish Date - 2021-05-05T16:14:56+05:30 IST
కిరాణ, కూరగాయల దుకాణాలు మినహా ఇతర దుకా ణాలన్నింటికీ ఈ నెల 6వ తేదీ నుంచి మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను అడ్డుకొనేలా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల
- 6 నుంచి దుకాణాల మూసివేత
ఐసిఎఫ్(చెన్నై): కిరాణ, కూరగాయల దుకాణాలు మినహా ఇతర దుకా ణాలన్నింటికీ ఈ నెల 6వ తేదీ నుంచి మూసివేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను అడ్డుకొనేలా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలులో ఉంది. ఈ నేప థ్యంలో, వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం...
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి.
- సబర్బన్, మెట్రోరైళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, టాక్సీ, ఆటోల్లో 50 శాతం మాత్రమే ప్రయాణించాలి.
- వాణిజ్య కాంప్లెక్స్ల్లో షాపులు, కూరగాయల దుకాణాలకు అనుమతి లేదు. ఇవి మినహా మిగిలిన కిరాణ, కూరగాయల దుకాణాలు మాత్రమే ఏసీ లేకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచుకోవచ్చు.
- కిరాణ, కూరగాయల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు తెరి చేందుకు నిషేధం.
- మెడికల్ షాపులు, పాల విక్రయ దుకాణాలు యధావిధిగా పని చేస్తాయి.
- అన్ని హోటళ్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి. టీ దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయాలి.
- ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాలు, కమ్యూనిటీ హాల్స్లో సాంస్కృతిక కార్యక్రమాలకు నిషేధం.
- అంత్యక్రియల్లో 20 మంది మాత్రమే పాల్గొనాలి.