బాధితుల కంటే డిశ్చార్జ్లు తక్కువ..
ABN , First Publish Date - 2021-08-21T17:16:02+05:30 IST
రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొవిడ్ బాధితులకంటే డిశ్చార్జ్ అయినవారు తక్కువగా ఉండడం గమనార్హం. 1,453 మంది వైరస్
బెంగళూరు: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొవిడ్ బాధితులకంటే డిశ్చార్జ్ అయినవారు తక్కువగా ఉండడం గమనార్హం. 1,453 మంది వైరస్ బారినపడగా 1,408మంది కోలుకున్నారు. చామరాజనగర్లో ఒక్క కేసు కూడా న మోదు కాలేదు. 16జిల్లాల్లో పదిమందిలోపు నమోదు కాగా ఇతర జిల్లాల్లో వందలోపు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17మంది మృతి చెందగా దక్షిణకన్నడలో ఆరుగురు, ఉత్తరకన్నడ, మైసూరులలో ఇద్దరు చొప్పున, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 20 జిల్లాల్లో మృతులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం.