ఆరు జిల్లాల్లో నిల్.. బెంగళూరులో అత్యధిక Covid కేసులు
ABN , First Publish Date - 2021-10-24T17:01:35+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 371 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా వీటిలో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాకపోగా బెంగళూరు
బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 371 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా వీటిలో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాకపోగా బెంగళూరులో అత్యధికంగా 193 మందికి వైరస్ సోకింది. ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు, మూడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఐదు జిల్లాల్లో నలుగురు చొప్పున, ఇతర జిల్లాల్లో 5-25లోపు, దక్షిణకన్నడలో 34మంది నమోదయ్యారు. 342 మంది కోలుకోగా ఏడుగురు మృతిచెందారు. 30 జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 8,914 మంది చికిత్సలు పొందుతున్నారు.