Bengaluruలో మరోసారి పెరిగిన covid కేసులు
ABN , First Publish Date - 2021-10-21T16:57:59+05:30 IST
రాష్ట్రంలో గడిచిన పదిరోజులు గా కొవిడ్కేసులు తగ్గుముఖం పట్టగా తాజాగా బుధవారం బెంగళూరులో కేసు లు పెరిగాయి. ఈ పరిణామం రాష్ట్రమంతటా ప్రభావం చూపింది. 462 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో
బెంగళూరు(karnataka): రాష్ట్రంలో గడిచిన పదిరోజులు గా కొవిడ్కేసులు తగ్గుముఖం పట్టగా తాజాగా బుధవారం బెంగళూరులో కేసు లు పెరిగాయి. ఈ పరిణామం రాష్ట్రమంతటా ప్రభావం చూపింది. 462 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 253 మంది, మైసూరులో 43మంది, తుమకూరులో 32 మందికి వైరస్ సోకింది. నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 479 మంది డిశ్చార్జ్ కాగా 9 మంది మృతిచెందారు. 26 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. 30 జిల్లాల్లో ఇంకా 9,074 మంది చికిత్సలు పొందుతుండగా 6,760 మంది బెంగళూరులోనే ఉన్నారు.