150కి కొత్త స్ట్రెయిన్ కేసులు
ABN , First Publish Date - 2021-01-24T08:33:01+05:30 IST
దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు 150కి చేరాయి. శనివారం మరో ఐదుగురికి స్ట్రైయిన్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది...
- 14,256 మందికి పాజిటివ్
న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు 150కి చేరాయి. శనివారం మరో ఐదుగురికి స్ట్రైయిన్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం వరకు బాధితుల సంఖ్య 145గా ఉంది. మరోవైపు దేశంలో శుక్రవారం 14,256 మందికి పాజిటివ్ వచ్చింది. వైర్సతో 152 మంది మృతిచెందారు. మరో 17,130 మంది కోలుకోవడంతో రికవరీలు 1.03 లక్షలు దాటాయి. యాక్టివ్ కేసులు 1.85 లక్షలకు తగ్గాయి. శుక్రవారం 8.37 లక్షల పరీక్షలు చేశారు. దేశంలో శనివారం 1,46,598 మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 15,37,190 మందికి టీకా పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. 13 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించింది. కరోనా టీకా తీసుకున్నవారి ఆరుగురు మరణించారని.. అయితే ఇవేవీ టీకా కారణంగా సంభవించినవి కాదని తెలిపింది. 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. టీకా వేశాక ఆస్పత్రిపాలైన వారిలో వీరి శాతం 0.0007 అని కేంద్రం చెప్పింది. ఏపీలోని గుంటూరులో జనవరి 20న టీకా తీసుకున్న వ్యక్తి తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది.