దేశంలో స్వల్పంగా పెరిగిన Corona positive కేసులు..పెరుగుతున్న మరణాలు
ABN , First Publish Date - 2021-10-28T16:11:56+05:30 IST
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కరోనా మరణాలు మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 733 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కరోనా మరణాలు మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 733 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 3,42,31,809 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 4,56,386 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులు ఉండగా, 3,36,14,434 మంది రికవరీ అయినట్లు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వెల్లడించింది.