‘కరోనా తరువాత 9 నెలల పాటు శరీరంలో యాంటీబాడీలు..’
ABN , First Publish Date - 2021-07-20T03:18:10+05:30 IST
కరోనా నుంచి కోలుకున్న తరువాత శరీరంలో 9 నెలల పాటు యాంటీబాడీలు నిలిచి ఉంటాయని తాజా అధ్యయనంలో బయటపడింది.
లండన్: కరోనా నుంచి కోలుకున్న తరువాత శరీరంలో 9 నెలల పాటు యాంటీబాడీలు నిలిచి ఉంటాయని తాజా అధ్యయనంలో బయటపడింది. ఇటలీలోని పడువా యూనివర్శిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనా బారిన పడి కోలుకున్న వారిని అదే ఏడాది నవంబర్లో మళ్లీ పరీక్షించగా వారిలో యాంటీబాడీలు అధిక సంఖ్యలోనే ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో తొమ్మిది నెలల తరువాత కూడా అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.