ఈపీఎఫ్ఓ’లో భారీ చేరికలు...
ABN , First Publish Date - 2021-10-26T00:08:41+05:30 IST
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో(ఈపీఎఫ్ఓ) కొత్త సభ్యుల చేరికలు ఎప్పటికప్పుడు భారీగా జరుగుతున్నాయి. ఈ ఏడాది(2021) జులైతో పోలిస్తే... ఆగస్టులో కొత్త సభ్యుల చేరిక 12.61 శాతం పెరిగినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో(ఈపీఎఫ్ఓ) కొత్త సభ్యుల చేరికలు ఎప్పటికప్పుడు భారీగా జరుగుతున్నాయి. ఈ ఏడాది(2021) జులైతో పోలిస్తే... ఆగస్టులో కొత్త సభ్యుల చేరిక 12.61 శాతం పెరిగినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కిందటి ఆగస్టులో 14.81 లక్షల మంది కొత్త చందాదారులు చేరారని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో నికర ఉద్యోగాల్లో పెంపు చోటుచేసుకుంటోందని పేర్కొంది.
ఈ ఏడాది జులైలో కొత్త చందాదారులతో పోల్చుకుంటే, ఆగస్టులో 12.61 శాతం మేర వృద్ధి నమోదైంది. కాగా... ఆగస్టుకు సంబంధించిన 14.81 లక్షల మంది నికర చందాదారుల్లో... 9.19 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పథకంలోకి చేరారు.
ఇదిలా ఉంటే... 5.62 లక్షల మంది నికర చందాదారులు ఈపీఎఫ్ఓను వదిలి, కొత్త ఉద్యోగాల నేపధ్యంలో మళ్లీ పథకంలోకి వచ్చారు. కాగా... 22-25 ఏళ్ల మధ్య వయసున్న 4.03 లక్షల మంది ఆగస్టులో కొత్తగా నమోదు చేసుకోగా, 18-21 ఏళ్ల మధ్య ఉన్న వారు 3.25 లక్షల మంది నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.